ఒకరిద్దరు ఒకే కాన్పులో పుట్టడం సహజం… కానీ సిరిసిల్ల జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది, ఒకే కాన్పులో నలుగురు పిల్లలు పుట్టారు. ఇది ముస్తాబాద్ లోని పీపుల్స్ హాస్పిటల్ లో ఓ మహిళకు అరుదైన శస్త్ర చికిత్స జరిగింది.
వివరాల్లోకి వెళ్ళితే….
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంబీరావుపేట మండలంలో సముద్రలింగాపూర్ కు చెందిన గొట్టుముక్కల లావణ్య అనే మహిళకు మొదటి కాన్పులో ఒక బాబు జన్మించిన తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ రెండో కాన్పులో నలుగురు పిల్లలు జన్మించారు.
బాబు, తర్వాత పాప, బాబు, బాబు మొత్తం నలుగురు పిల్లలు పుట్టారని పిల్లలంతా ఆరోగ్యంగానే ఉన్నారని డాక్టర్లు స్పష్టం చేశారు.