భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️ దుర్గా ప్రసాద్
రైతులకు సంక్షేమమే లక్ష్యంగా పాల్వంచ సొసైటీ పాలకవర్గం కృషి చేస్తున్నదని DCMS వైస్ చైర్మన్,పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సొసైటీ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన కొత్వాల మాట్లాడుతూ రైతులకు నిత్యం అందుబాటులో ఉంటూ రుణాలు పంపిణీ, సకాలంలో ఎం.ఆర్.పి ధరలకే ఎరువులు, సబ్సిడీ పై విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నామన్నారు.వరి ధాన్యం కొనుగోలు పై గత 5 సీజన్ల నుండి కమిషన్ పెండింగ్ లో,ఉందని అధికారులు వెంటనే సొసైటీ కమిషన్ ఇవ్వాలన్నారు. 3 శాతం రిబేట్ రావలసి ఉన్నదని,టెస్కాబ్, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్ లో ప్రవేశపెట్టిన 90 వేలు రైతు రుణమాఫీని వెంటనే విడుదల చేయాలన్నారు. మధ్యకాలిక రుణాలయినా పాడి గేదెలు, ద్విచక్ర వాహన రుణాలకు మాఫీ ఉండదు కనుక రైతులు అప్పులు వెంటనే చెల్లించాలని కొత్వాల అన్నారు.
సొసైటీ అభివృద్ధి అంతా పాలకవర్గం సభ్యులు, రైతులు, ప్రజా ప్రతినిధులు సహకారంతోనే జరుగుతుందని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ కాంపెల్లి కనకేష్, డైరెక్టర్లు బుడగం రామమోహన్రావు, కనగాల నారాయణరావు, సామ జనార్దన్ రెడ్డి, చౌగాని పాపారావు, జరబన సీతారాం బాబు, భూక్య కిషన్, బర్ల వెంకటరమణ, సొసైటీ సీఈఓ జి లక్ష్మీనారాయణ, రైతులు పాల్గొన్నారు.