భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
✍️దుర్గా ప్రసాద్
యావత్ భారత దేశంలోని అన్ని మతాలకు, వర్గాలకు ఆదర్శప్రాయుడు అంబేద్కర్ అని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా శుక్రవారం BRS పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటరులోని అంబేద్కర్ విగ్రహానికి కొత్వాల తో పాటు BRS పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కొత్వాల మాట్లాడుతూ అంబేద్కర్ ఎల్లప్పుడూ కులమతాలకతికంగా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పనిచేసిన వ్యక్తి అని అన్నారు. అంబేద్కర్ దేశానికి చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు 125 అదుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించి, నేడు ఆవిష్కరణ జరుపుతున్నారన్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టడం గర్వకారణమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరు సమాజ సేవ చేయాలనీ కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమంలో కొత్వాలతో పాటు పెద్దమ్మగుడి డైరెక్టర్ SVRK ఆచార్యులు, బండి చిన్న వెంకటేశ్వర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాశరావు, BRS నాయకులు కాల్వ భాస్కర్, దాసరి నాగేశ్వరావు, కొత్తపల్లి సోమయ్య, రెడ్డిమళ్ల వెంకటేశ్వర్లు, ఎలకా రామస్వామి, మిరియాల వెంకటేశ్వర్లు, దారా చిరంజీవి, బుదే గిరి, జమాల్ సైదులు, గజ్జి శ్రీను, తెలంగాణ సురేష్, సందీప్, తదితరులు పాల్గొన్నారు.