తెలంగాణా రాష్ట్ర ప్రజలకు కంటిచూపు ప్రసాదిస్తున్న మహోన్నతవ్యక్తి C.M.కె.సి.ఆర్.. – DCMS వైస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
సకలేంద్రియానం నయనం ప్రధానం’ అన్ని ఇంద్రియాల్లో కెల్లా కళ్ళు ప్రధానం అని, అట్టి కళ్ళకు చూపుల్లో ఇబ్బందులు లేకుండా కంటి వెలుగును ప్రసాదిస్తున్న మహోన్నతవ్యక్తి CM కెసిఆర్ అని DCMS వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గురువారం పాల్వంచ మున్సిపాలిటీ పరిధి వనమా కాలనీలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని కొత్వాల సందర్శించారు. శిబిరంలోని పరీక్షలు చేస్తున్న డాక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కంటిచూపు మందగించిన వారికి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ…
తెలంగాణ రాష్ట్రాన్ని వ్యాధిరహితంగా చేయడమే కె.సి.ఆర్ ద్యేయం అన్నారు.శిబిరంలో ఉచితంగా కంటి పరీక్షలు చేసి, మందులు, కళ్ళజోళ్ళు ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు.ఎంతటి కంటి సమస్య వున్నా నివారణ మార్గాలను,అత్యున్నత నాణ్యత కలిగిన వైద్యాన్ని ఎలాంటి ఖర్చు లేకుండా అందించడమే కె.సి.ఆర్, తెలంగాణ ప్రభుత్వం లక్ష్యం అని కొత్వాల అన్నారు.
ఈ కంటి వెలుగు కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసరెడ్డి, డాక్టర్ రాజశేఖర్, పి.ఎం.ఒ. క్రాంతి కుమార్, డి.ఇ.ఒ మధు, హెడ్మాస్టర్ శ్రీమతి ఎం.తేజ, పెద్దమ్మగుడి డైరెక్టర్ SVRK ఆచార్యులు, మాజీ కౌన్సిలర్ కాల్వ భాస్కరరావు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కాల్వ ప్రకాశరావు,BRS నాయకులు దాసరి నాగేశ్వరరావు, బ్యాంక్ రాజేందర్, దారా చిరంజీవి, అశోక్, ఎ.ఎన్.ఎం.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.