భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

కొత్తగూడెం నియోజకవర్గం పాల్వంచ పట్టణం టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ గారి అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో ఏడవల్లి మాట్లాడుతూ…

ఈ నెల 24వ తేదీ నాడు మన ప్రియతమా నాయకుడు తేలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పాల్గొననున్న నిరుద్యోగ నిరసన దీక్ష నీ విజయవంతం చేయాలని కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు పిలుపు ఇచ్చారు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక అనేక సమస్యలు ఏదురుకుంటున్న విషయాల కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులకు ఏమి చేస్తుంది అనే అంశాలను పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు వివరిస్తారని నిరుద్యోగులు కూడా నియోజవర్గం నుండి భారీగా పాల్గొనాలని టిపిసిసి జనరల్ సెక్రెటరీ ఏడవల్లి కృష్ణ తెలిపారు.

ఈ కార్యక్రమములో పాల్వంచ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు కాంగ్రెస్ నాయకులు కొండ వెంకన్న గౌడ్, ఓ బి సి నాయకులు నర్సింహ చారి, కట్ట సోమయ్య, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పైడిపల్లి మనోహర్, బత్తుల వెంకటేశ్వరరావు, మైనార్టీ నాయకులు చాంద్ పాషా, రామ్ నాయక్, లోగని మురళి, బద్ధి కిషోర్, గుండా శ్రీనివాసరావు, భాను తేజ, వీరయ్య చౌదరి, సెవ్య, మెంటం రాము,మురారి పద్మ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.