పేదింటి ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్మి పథకం ఒక వరం.. – MLA వనమా

బుదవారం రోజు కొత్తగూడెం మున్సిపాలిటీ వివిధ వార్డులలో 37 మంది కళ్యాణ్ లక్ష్మీ లబ్ధిదారులకు సుమారు 3,70,492 రూపాయల చెక్కులను తన చేతులు మీదుగా స్వయంగా పంపిణీ చేసిన *గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ…

తింటే గారెలే తినాలి కంటే కూతుర్నే కనాలి అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపిల్లలకు పెద్దన్నగా ఈ కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టారని, నియోజకవర్గంలో ఇప్పటివరకు 30 కోట్ల రూపాయల చెక్కులను కళ్యాణ్ లక్ష్మి లబ్ధిదారులకు అందచేసానని అన్నారు.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, MRo కౌన్సిలర్లు కోలాపూరి ధర్మరాజు, పరమేష్ యాదవ్, మోరే రూప బిఆర్ఎస్ నాయకులు MA రజాక్, రావి రాంబాబు, యూసుఫ్, కొండ స్వామి, సుందర్ రాజ్ మరియు రెవెన్యూ సిబ్బంది, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు పాల్గొన్నారు.