దేశంలో గడిచిన 5 సం..లలో 119 మంది మెడికల్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు జాతీయ వైద్య మండలి వెల్లడించింది
.
యూజీ గ్రాడ్యుయేట్లు 64 మంది ఉండగా.. 55 మంది పోస్ట్‌ గ్రాడ్యుయేట్ విద్యార్థులు.

ఇది ఇలా ఉండగా గత ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్‌కు గుడ్‌బై చెప్పారు.

ఎంబీబీఎస్ యూజీలో 160.

పీజీ జనరల్‌ సర్జరీలో 114.

ఎంఎస్‌ ఆర్థోపెడిక్స్‌లో 50.

గైనకాలజీలో 103.

ఎంఎస్‌ ఈఎన్‌టీలో 100.

ఎండీ జనరల్‌ మెడిసిన్‌లో 56.

ఎండీ పిడియాట్రిక్స్‌లో 54.

ఇతర బ్రాంచ్‌లన్నింటిలో కలిపి 529 మంది వైద్యవిద్యను మధ్యలోనే వదిలి వెళ్లిపోయినట్లు వెల్లడించింది.