భారత ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్ సీఈవో కునాల్ షా… ఆయన నెలకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా తీసుకుంటున్నారు.
ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ అంటూ నెటిజన్లతో ముచ్చటించారు కునాల్‌ షా…

ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు స్పందించిన ఆయన.. ‘నా శాలరీ నెలకు రూ.15 వేలే అని సమాధానం ఇచ్చారు. కంపెనీ లాభాలబాట పట్టేవరకూ నేను భారీ స్థాయిలో జీతభత్యాలు తీసుకోవడం సబబు కాదని భావిస్తున్నానన్న ఆయన… గతంలో నా కంపెనీ ఫ్రీఛార్జ్‌ను అమ్మేయగా వచ్చిన డబ్బు నాకు సరిపోతోంది అంటూ బదులిచ్చారు.

ఆ సంభాషణ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.