మే 21, 2023 ఆదివారం ఉదయం 10:30 గంటలకు పాల్వంచ నటరాజ్ సెంటర్లో తెలంగాణ మున్నూరు కాపు పటేల్స్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాల్వంచ పట్టణ, మండల కార్యాలయం ప్రారంభోత్సవం చేస్తున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ తెలిపారు. ఈరోజు పాల్వంచ నటరాజ్ సెంటర్ లోని కాంపెల్లి కనకేష్ పటేల్ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసిన సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ పాల్వంచ పట్టణ మండలంలో పదివేలకు పైగా మున్నూరు కాపు కులస్తులు ఉన్నారని ఈ కార్యాలయం వీరందరికీ అందుబాటులో ఉండటం కోసం ఏర్పాటు చేస్తున్నట్లు మరియు పాల్వంచలో ఉన్నటువంటి మున్నూరు కాపులకు ఎటువంటి సమస్యలు వచ్చిన వాటి పరిష్కారానికి కృషి చేస్తూ త్వరలోనే పాల్వంచ పట్టణ, మండల కమిటీలను మరియు యువత కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి ఆకుల ఆనంద్, కార్యనిర్వాహక అధ్యక్షులు చింత నాగరాజు, కోశాధికారి మద్దుల వీర మోహన్ రావు, ఉపాధ్యక్షులు బాలినేని సత్యనారాయణ, వీసంశెట్టి విశ్వేశ్వరరావు, కార్యదర్శి ఆది రాజేష్, కార్యవర్గ సభ్యులు మేడిశెట్టి సాంబశివరావు, అడపా సత్యనారాయణ, ముళ్లపాటి శ్రీకాంత్, రామిశెట్టి లక్ష్మణ్, మండలి శరత్ కుమార్, గోవాడ రవి, గంగారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.