సుమారు రూ.కోటి విలువ చేసే గంజాయిని కంకిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిపై కంకిపాడు సమీపంలోని దావులూరు టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు.
ఆ సమయంలో ఓ వాహనంలో తరలిస్తున్న 132 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నర్సాపురానికి చెందిన జక్కంపూడి హనుమంతు, షేక్ కాలీషా కారులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.