కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు అధిష్ఠానం నుంచి రాష్ట్ర పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ TPCC డిసెంబర్ నెలలోనే తీర్మానం చేసింది. ఇటీవల రెండోసారి కూడా తీర్మానం చేయగా దానిపై సోనియా గాంధీ సానుకూలంగా స్పందించారు.