శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

10వ తరగతి నుంచి పీజీ వరకూ విద్యార్హత కలిగి 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు గల యువతకు ఉద్యోగ ఉపాధి కల్పనకు వీలుగా ఈ జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.