వైసీపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కర్ణాటక, తెలంగాణలో వచ్చినట్టుగానే ఫలితాలు ఏపీలో కూడా రావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

అయితే షర్మిల గురువారం కాంగ్రెస్ గూటికి చేరగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు ఇదే బాటలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. మరికొంత మంది కీలక నేతలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకునే యోచనలో ఉన్నట్టు సమాచారం