ధరణి పోర్టల్ ని కొనసాగిస్తున్నారా? లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు 4 వారాల గడువు కావాలని ఏజీ కోరడంతో, విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది.

ధరణిలో ఎదురైన సమస్యలపై కొందరు కోర్టును ఆశ్రయించగా, ధరణిపై ప్రభుత్వ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుని పిటిషన్లను విచారిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు.