ప్రతిష్ఠాత్మక ఐఐటీలకు విదేశాల్లోనూ ఆదరణ పెరుగుతోంది. ఇప్పటికే టాంజానియాలో IIT మద్రాస్ క్యాంపస్ ప్రారంభం కాగా తాజాగా శ్రీలంకలోనూ క్యాంపస్ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్న ఐఐటీ మద్రాస్.. త్వరలోనే ఆ దేశంలో క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు అబుదాబిలో క్యాంపస్ ఓపెన్ చేసేందుకు UAEతో ఢిల్లీ ఐఐటీ ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.