ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. అలీపూర్ దయల్పూర్ మార్కెట్లో గురువారం సాయంత్రం ఓ పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి 11 మంది సజీవదహనమయ్యారు.
మంటలు అదుపులోకి వచ్చినప్పటికీ.. మరికొందరి ఆచూకీ లేకపోవడంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, రాత్రి 9 వరకు మంటలు అదుపులోకి వచ్చాయని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారి ఒకరు తెలిపారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.