రథసప్తమి వేడుకల సందర్భంగా తిరుమలకు భక్తులు పోటెత్తారు. అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయి వెలుపల క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు.

దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. నిన్న ఒక్క రోజే స్వామివారిని 45,825 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే.. 21,380 మంది తలనీలాలు సమర్పించారు. భక్తులు సమర్పించిన కానుకల ద్వారా శ్రీవారి హుండీ ఆదాయం 4.03 కోట్లు వచ్చిందని టీటీడీ వెల్లడించింది.