బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది.
2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ను శ్రీనివాస్ గౌడ్ టాంపరింగ్ చేసినట్లు దాఖలైన పిటిషన్ను శుక్రవారం న్యాయస్థానం కొట్టేసింది.
పిటిషన్ విచారించే పరిధి ప్రజాప్రతినిధుల కోర్టుకు లేదని.. ఏ కోర్టు పరిధిలోకి వస్తుందో తేల్చుకోవడానికి హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ రాఘవేందర్ రాజుకు న్యాయమూర్తి సూచించారు.