ఉచిత విద్యుత్ పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
గృహజ్యోతి పథకంలో భాగంగా 200 యూనిట్ల ఉచిత కరెంట్ పొందాలనుకునే వారు ఆధార్ కలిగి ఉన్నట్లు రుజువు చూపించాల్సి ఉంటుందని, లేకపోతే ఆధార్ అథెంటికేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆధార్ కార్డు లేని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.