ఏపీ టెట్, టీఆర్టీ పరీక్షలకు కొత్త షెడ్యూల్ ప్రకటించాలన్న పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ రెండు పరీక్షల మధ్య సముచిత సమయం ఉండేలా చూడాలని కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ప్రస్తుత నోటిఫికేషన్ రద్దు చేసి తాజాగా మరో షెడ్యూల్ జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ పై బుధవారమే వాదనలు పూర్తయ్యాయి.