ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటన రద్దయినట్లు సమాచారం.
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) అభివృద్ధి ప్రాజెక్టును ప్రారంభించేందుకు మార్చి 1న వైజాగు పీఎం రావాల్సి ఉంది. ఇప్పటికే అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ప్రారంభించగా.. పర్యటన రద్దుతో తాత్కాలికంగా నిలిపివేశారు.
పర్యటన రద్దుపై అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు.