భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం సింగరేణి ఏరియాలోని త్రీ-ఇంక్లెన్ 48 ఎకరాల్లో రూ.56.76 కోట్లతో 10.5 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించిన సోలార్ ప్లాంట్ ను ఆదివారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించనున్నారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవనుంది. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర రావు హాజరు కానున్నారు.