హరియాణాలో దారుణం చోటుచేసుకుంది. ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (INLD) రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ MLA నఫే సింగ్ రాఠీ దారుణ హత్యకు గురయ్యారు.

ఆదివారం సాయంత్రం ఝజ్జర్ జిల్లాలో ఆయన ప్రయాణిస్తున్న కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కాల్చి చంపారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న మరో ఇద్దరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.