ఒక పరువునష్టం కేసులో తనకు జారీ అయిన సమన్లను ఢిల్లీ హైకోర్టు సమర్థించడాన్ని సవాల్చేస్తూ ఢిల్లీ CM కేజీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టులో సోమవారం విచారణ జరగనుంది.
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ 2018మే నెలలో రూపొందించినట్లు చెబుతున్న ఒక వీడియోను కేజీవాల్ తిరిగి ట్వీట్ చేసినందుకు క్రిమినల్ కేసు దాఖలైంది. ట్రయల్ కోర్టు సమన్లను కొట్టివేయడానికి నిరాకరించింది. దీనిపై కేజీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.