పవన్ కళ్యాణ్ ఫ్రస్ట్రేషన్ పీక్కు చేరిందని మంత్రి రోజా విమర్శించారు. పార్టీ పెట్టి పదేళ్లయినా 24 సీట్లకే పోటీ చేస్తున్నారని, పొత్తులో ముష్టి 30 సీట్లు తెచ్చుకోలేని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.

ఆయన పూర్తిగా చంద్రబాబు మాయలో పడిపోయారని చెప్పారు. పార్టీకి అధ్యక్షుడైనప్పటికీ ఇప్పటిదాకా బూత్ కమిటీలు వేయలేకపోయారన్నారు. గట్టిగా అరిస్తే ఓట్లు పడవనే విషయాన్ని పవన్ తెలుసుకోవాలని హితవు పలికారు.