ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేస్తోంది. ఇప్పటికే రా.. కదలిరా పేరుతో చంద్రబాబు, శంఖారావం పేరుతో లోకేశ్ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు.
మార్చి 4న రా.. కదలిరా సభలు ముగియనున్నాయి. దీంతో మార్చి 6 నుంచి ప్రజా గళం పేరిట కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలుత నంద్యాల, మైదుకూరులో సభలు ఉంటాయని సమాచారం.