ఇరాన్ ప్రభుత్వం కొంత కాలంగా ఎక్కువగా ఉరిశిక్షలు విధిస్తోంది. ఇస్లామిక్ చట్టాలకు ప్రాధాన్యత ఇస్తూ ఇరాన్ మరణ శిక్షలను ఎక్కువగా అమలు చేస్తుండటంపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన నెలకొంది.
అయితే 2023 ఒక ఏడాదిలోనే 834మందికి ఆ దేశం మరణశిక్ష విధించింది. కాగా 2015 తర్వాత ఇదే అత్యధికమని తెలుస్తోంది.