ఇకపై రైలు ప్రయాణికులు తమకు కావాల్సిన ఆహారాన్ని నచ్చిన రెస్టారెంట్ నుంచి తెప్పించుకోవచ్చు. ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ ‘స్విగ్గీ’ ఆ ఫుడ్ ను అందించనుంది.
ఈ మేరకు ఈరోజు (మంగళవారం) IRCTC, స్విగ్గీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ నెల 12వ తేదీ నుంచి విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్, బెంగళూరు స్టేషన్లలో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి.