కర్నాటక విధానసౌధాలో రాజ్యసభ ఎన్నికల సందర్భంగా పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించిన ముగ్గురిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ నివేదిక ఆధారంగా అరెస్టులు జరిగాయని పోలీసులు చెప్పారు. ఈ కేసులో పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని కర్నాటక హోంమంత్రి పరమేశ్వర చెప్పారు. అరెస్టయిన ముగ్గురిని ఢిల్లీకి చెందిన ఇల్తాజ్, బెంగళూరుకు చెందిన మునవర్, హవేరీ వాసి మహ్మద్ షఫీగా గుర్తించారు.