శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల వల్ల వచ్చే కాలుష్యంపై ఆందోళనతో విద్యుత్ వాహనాలపై (ఈవీ) చాలామంది దృష్టి పెడుతున్నారు.

అయితే… ఆ వాహనాలతో పోలిస్తే ఈవీలు సుమారు 1800 రెట్లు ఎక్కువగా పార్టికులేట్ మేటర్(పీఎం) కాలుష్యాన్ని కలుగజేస్తున్నాయని ‘ఎమిషన్ అనాలిటిక్స్’ అనే సంస్థ చేసిన సర్వేలో తేలింది.

ఈవీల అధిక బరువు కారణంగా టైర్ల నుంచి గాల్లోకి దుమ్ము, కాలుష్యం ఎక్కువగా చేరుతున్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది.