టెన్త్ పరీక్షల హాల్టికెట్లు రేపు విడుదల కానున్నాయి. ఈ నెల 18 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రింటెడ్ హాల్టికెట్లను స్కూళ్లకు అధికారులు పంపించారు.

అలాగే స్కూళ్ల యాజమాన్యాలతో సంబంధం లేకుండా వెబ్సైటు నుంచి విద్యార్థులు నేరుగా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. కాగా ఈ పరీక్షల కోసం 2,676 సెంటర్లను ఏర్పాటు చేయగా.. 5.08 లక్షల మంది విద్యార్థులు హాజరవనున్నారు.