ఢిల్లీలో దారుణం జరిగింది. జిమ్ ట్రైనర్ గౌరవ్ సింఘాల్ కు మరికొన్ని గంటల్లో పెళ్లి కావాల్సి ఉండగా బంధువులు ఊరేగింపు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

అదే సమయంలో సింఘాల్ కు తండ్రితో గొడవ జరిగింది. ఆవేశంలో అతడిని తండ్రి రంగలాల్ 15 సార్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. బంధువులు ఊరేగింపు కోసం వరుడిని వెతకగా అతడు రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు. నిందితుడు రంగలాల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.