ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు ఇంటెల్ ఇండియా సహకారంతో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తోంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లిలోని ఉన్నత పాఠశాలలో తొలి ల్యాబ్ను అందుబాటులోకి తెచ్చింది. ‘ఏఐ ఫర్ యూత్’ పేరుతో నాలుగు సెషన్లలో 8, 9 తరగతుల విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. అనంతరం దీనిపై విద్యార్థులు చేత ప్రాజెక్టులు తయారు చేయిస్తారు.