హైదరాబాద్ తో పాటు ఉత్తర తెలంగాణలోని 5జిల్లాల ప్రజలు, వాహనదారుల ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం 5గంటలకు కండ్లకోయ సమీపంలో ఎలివేటెడ్ డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి మొదలై తాడ్బండ్ జంక్షన్, బోయినపల్లి జంక్షన్ మీదుగా డెయిరీ ఫామ్ రోడ్డు వద్ద ముగుస్తుంది.