సీఎం జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని ఆయన నివాసంలో బయలుదేరి మేదరమెట్ల చేరుకుంటారు.
అక్కడ జరిగే సిద్ధం సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మరోవైపు ఈ సభకు భారీ ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకానున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 200 ఎకరాల విస్తీర్ణంలో సభ ప్రాంగణాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.