రాష్ట్రంలోని రైతులకు కేంద్రం తీపికబురు చెప్పింది. PM కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయానికి సౌర విద్యుత్ అందించాలని నిర్ణయించింది.
20వేల వ్యవసాయ మోటార్ల కోసం ప్రయోగాత్మకంగా సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు 30% రాయితీ ఇస్తామని ప్రకటించింది. ఫలకాల ఏర్పాటుకు దాదాపు రూ.2.5లక్షలు ఖర్చయితే అందులో రూ.75వేల వరకు కేంద్రం అందిస్తుంది. రైతుల మేలు కోసం రాష్ట్ర ప్రభుత్వమూ కొంత రాయితీ ఇవ్వాలని కేంద్రం సూచించింది.