బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా ఈ బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది.

మెట్రోలో ప్రయాణించిన వారిని సురక్షితంగా, తక్కువ ఛార్జీలతో ఇంటివద్దకు చేర్చేందుకు 2022లో బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. అయితే మహిళలపై వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంలో ర్యాపిడోకు మాత్రం హైకోర్టు ఊరటనిచ్చింది.