మాజీ ప్రధాని వాజ్ పాయ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మై అటల్ హూ’. జనవరి 19న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో మార్చి 14 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ బయోపిక్ స్ట్రీమింగ్ కావొచ్చని తెలుస్తోంది. రవి జాదవ్ దర్శకత్వం వహించిన ఈ పొలిటికల్ డ్రామాలో వాజ్పేయీ పాత్రలో పంకజ్ త్రిపాఠి నటించారు.