మెదక్ జిల్లా వెల్దుర్తిలో హృదయవిదారకర ఘటన చోటు చేసుకుంది. ప్రసవ వేదనతో ఆస్పత్రికి వచ్చిన ఓ గర్భిణీ కారు చీకట్లో నేలపైనే ప్రసవించింది.

ఆదివారం అర్ధరాత్రి పురుటి నొప్పులతో తాటి సృజన ఆస్పత్రికి వచ్చింది. ఆ సమయంలో ఆస్పత్రికి తాళం వేసి ఉంది. అప్పటికే నొప్పులు ఎక్కువైన ఆమె వరండాలోనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనపై స్పందించిన ఉన్నతాధికారులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.