మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “2019లో బీజేపీ ఓటమి తర్వాత ‘నేను మళ్లీ తిరిగొస్తా’ అని అప్పుడు చేసిన ప్రచారాన్ని ఎద్దేవా చేశారు.
కానీ తర్వాత రెండు పార్టీలను చీల్చి అధికారంలోకి వచ్చాను. ఇద్దరు స్నేహితులనూ వెంట తెచ్చుకున్నా. పవర్ లోకి రావడానికి రెండున్నరేళ్లు పట్టింది” అని తెలిపారు. కాగా ఏక్నాథ్ షిండే వల్ల శివసేన, అజిత్ పవార్ తో NCP చీలిపోయిన సంగతి తెలిసిందే.