TS గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళసై సౌందరరాజన్ రాజీనామా చేశారు.
తమిళనాడు నుంచి MPగా పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యా కుమారిలో ఆమె సామాజికవర్గ నాడార్ ఓట్లు అధికం. తెలంగాణ గవర్నర్గా ఆమె 2019, సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు. KCR ప్రభుత్వ పలు నిర్ణయాలు అడ్డుకుని సంచలనంగా మారారు.