కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అమానవీయ ఘటన జరిగింది. భర్తతో గొడవపడిన భార్య మూగవాడైన 6ఏళ్ల కొడుకును మొసళ్లు ఉండే నదిలో విసిరేసింది.
రవికుమార్, సావిత్రి దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పుట్టు మూగ. ఎందుకు అలా జన్మనిచ్చావంటూ భార్యతో భర్త మూర్ఖంగా గొడవపడేవాడు. ఇటీవల మరోసారి ఇలా గొడవ జరగగా, ఆమె కొడుకును నదిలో విసిరేసింది. దీంతో పిల్లాడు మరణించాడు. పోలీసులు భార్యా భర్తలిద్దరినీ అరెస్టు చేశారు.