మెగా హీరో సాయిధరమ్ తేజ్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పిఠాపురం నియోజకవర్గంలోని గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో పవన్ కళ్యాణ్ తరఫున సాయిధరమ్ ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి సాయిధరమ్ తేజ్ వాహనంపైకి రాయి విసిరాడు. ఆ రాయి జనసేన కార్యకర్త నల్లల శ్రీధర్కు తగిలి తీవ్ర గాయమైంది. YCP MLA అభ్యర్థి వంగా గీత ఈ దాడి చేయించారని జనసైనికులు ఆరోపిస్తున్నారు.