గత పాలనలో మూతపడ్డ అన్న కాంటీన్లను పునఃప్రారంభించనుంది ఏపీ సర్కార్. అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది.

ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. సెప్టెంబరు 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించనున్నారు. అయితే ముందుగా మూడు వారాల్లోనే 100 క్యాంటీన్లను ఓపెన్ చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.