Month: January 2024

నకిలీ పాస్ పోర్ట్ జారీ చేసిన అధికారుల అరెస్ట్…

నకిలీ పాస్ పోర్ట్ జారీ కేసులో సీఐడీ అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో ఆరు జిల్లాల్లో పాస్ పోర్ట్ బ్రోకర్లను గుర్తించి 12మందిని అధికారులను అదుపులోకి తీసుకున్నారు. కెనడా, స్పెయిన్ దేశాల వీసాలు మంజూరు కావడంపై అనుమానం వచ్చి…

సైబర్​ నేరాల అవగాహన పోస్టర్​ రిలీజ్​ చేసిన ఎస్పీ సింధూశర్మ

నిన్న జిల్లా పోలీస్​ ఆఫీస్​లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నెలవారి రివ్యూ మీటింగ్​ నిర్వహించారు ఎస్పీ సింధూశర్మ. ఈ మీటింగ్ ఆమె మాట్లాడుతూ… మహిళల రక్షణకు పెద్దపీట వేయలన్నారు. మిస్సింగ్​ కేసులపై స్పెషల్ ఫోకస్​ పెట్టాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించవొద్దన్నారు.…

మహాలక్ష్మితో ఆరోగ్యలక్ష్మి

మహాలక్ష్మి పేరుతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత “బస్సు సర్వీసులు ఎంతోమంది మహిళల పాలిట వరంగా మారింది. ఉచిత బస్సు సర్వీసును ఉపయోగించుకొని చాలా మంది ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని స్వచ్ఛంద సంస్థ హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ 15 రోజులపాటు చేసిన సర్వేలో వెల్లడించింది.…

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

గత మూడు రోజుల నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు నేడు కూడా స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోలిస్తే హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 తగ్గడంతో రూ.58000కి చేరుకుంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల…

సుప్రీంకోర్టులో సీజేఐ ముందు విస్కీ బాటిళ్లు..!

సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గా శుక్రవారం సుప్రీంకోర్టులో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు రెండు విస్కీ బాటిళ్లను తీసుకువచ్చి పెట్టారు. పెర్నోడ్ రికార్డ్ కంపెనీ, జేకే ఎంటర్ప్రైజెస్ మధ్య జరుగుతున్న ట్రేడ్ మార్క్ వివాదంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పుపై…

కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపు

కవ్వాల్ టైగర్ రిజర్వు నుంచి గ్రామాల తరలింపునకు రంగం సిద్ధమైంది. నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేట, రాంపూర్ గ్రామాలను కోర్ ఏరియా వెలుపల ఉన్న ఇదే మండలంలోని ధర్మాజిపేటకు తరలించనున్నారు. ఈ గ్రామంలోనే వారికి పునరావాసం కల్పించనున్నారు. వారికి డబుల్…

ఎముకలు కొరికే చలి… అక్కడ సూర్యుడు కనిపించి ఏడురోజులైందటా…!

మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ వాసులను గత వారం రోజులుగా ఎముకలు కొరికే చలి గజగజ వణికిస్తోంది. ఈ ప్రాంతంలో ‘సూర్యుడు కనిపించి ఏడురోజులైందని స్థానికులు చెబుతున్నారు. పొద్దస్తమానం ఉండే చలి కారణంగా జనజీవనం స్తంభించింది. చలి నుంచి రక్షించుకునేందుకు స్థానికులు రగ్గుల కింద…

ఆంధ్రప్రదేశ్ లో MPగా అలీ పోటీ చేయనున్నాడా?

కమెడియన్ అలీ MPగా పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. YCP తరఫున ఆయన ఎన్నికల బరిలో నిలవనున్నట్లు సమాచారం. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న కర్నూలు లేదా నంద్యాల నుంచి MPగా పోటీ చేయాలని భావిస్తున్నట్లు టాక్. ఇదే విషయాన్నిCM జగన్…

మహారాష్ట్రలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో BRS పోటీ

మహారాష్ట్రలో జరిగే అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త శంకరన్న దోండ్గే ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడు KCR నాయకత్వంలో పేదలు, రైతులు, దళితుల కోసం పనిచేస్తామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇతర పార్టీల…

TS : త్వరలో RTC సిబ్బందికి పీఆర్సీ…

మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇప్పటివరకు 7కోట్ల మంది మహిళలు RTC బస్సుల్లో ప్రయాణించారని TSRTC MD సజ్జనార్ తెలిపారు. RTCకి కార్మికులు, ప్రయాణికులు రెండు కళ్లలాంటి వారని అన్నారు. త్వరలో RTC స్టాఫ్కు పీఆర్సీపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు. ఉద్యోగులకు మానసిక ఉల్లాసం…

TS : ధరణి పోర్టల్ నీ కొనసాగిస్తున్నారా…? లేదా…? : హైకోర్టు

ధరణి పోర్టల్ ని కొనసాగిస్తున్నారా? లేదా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పేందుకు 4 వారాల గడువు కావాలని ఏజీ కోరడంతో, విచారణను ఫిబ్రవరి 2కు వాయిదా వేసింది. ధరణిలో ఎదురైన సమస్యలపై కొందరు కోర్టును ఆశ్రయించగా,…

TS : జూన్ 11 నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియ…

జూన్ 11 నాటికి విద్యా వాలంటీర్ల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే విద్యాసంవత్సరంలో తొలిరోజు నుంచే విద్యా వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని నిర్ణయించింది. DSC ద్వారా టీచర్ల నియామకానికి 6-9 నెలల టైమ్ పట్టే అవకాశం ఉండడంతో…

తగ్గుతున్న బంగారం – వెండి ధరలు

గత మూడు రోజులుగా భారత్ లో బంగారం, వెండి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారంపై రూ.400 తగ్గి ప్రస్తుతం రూ.58,100 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల గోల్డేపై రూ.440 తగ్గి రూ.63,380గా ఉంది. అలాగే వెండి ధర…

AP : కాంగ్రెస్ వైపు అసంతృప్తుల చూపు!

వైసీపీలోని అసంతృప్త నేతలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు. కర్ణాటక, తెలంగాణలో వచ్చినట్టుగానే ఫలితాలు ఏపీలో కూడా రావొచ్చని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే షర్మిల గురువారం కాంగ్రెస్ గూటికి చేరగా వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మల్లాది విష్ణు…

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నేడు మెగా జాబ్ మేళా

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం మెగా జాబ్ మేళా నిర్వహించనున్నామని ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి నుంచి పీజీ…

ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ

కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఖమ్మం లోక్ సభ నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధిష్ఠానం నుంచి రాష్ట్ర పార్టీ కీలక నేతలకు సమాచారం అందినట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ నుంచి సోనియా పోటీ చేయాలని కోరుతూ…

AP : విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిపై భారీగా గంజాయి స్వాధీనం

సుమారు రూ.కోటి విలువ చేసే గంజాయిని కంకిపాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ- మచిలీపట్నం ప్రధాన రహదారిపై కంకిపాడు సమీపంలోని దావులూరు టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. ఆ సమయంలో ఓ వాహనంలో తరలిస్తున్న 132 కిలోల గంజాయిని…