Month: September 2023

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీ

నిజామాబాద్ జిల్లాలో ఏటీఎం చోరీ కలకలం రేపింది. మెండోరా మండలం పోచంపాడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ATMను ధ్వంసం చేసిన దుండగులు అందులోంచి రూ.12 లక్షలు ఎత్తుకెళ్లారు. దీనిపై బ్యాంకు అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు. సీసీ…

BJP : 3 రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు

దేశంలోని మూడు రాష్ట్రాలకు బీజేపీ తమ నూతన అధ్యక్షులను నియమించింది. పుదుచ్చేరి అధ్యక్షుడిగా ఎస్ సెల్వగణపతి, నాగాలాండ్ అధ్యక్షుడిగా బెంజమిన్ యెప్తోమి, మేఘాలయ అధ్యక్షుడిగా రిక్మాన్ మోమిన్ను నియమించినట్లు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా తెలిపారు. ఈ మేరకు ఆయా…

జమిలి ఎన్నికలపై లా కమిషన్ కీలక సమావేశం

జమిలి ఎన్నికలపై ఢిల్లీలో నేడు లా కమిషన్ కీలక సమావేశం నిర్వహించనుంది. లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రితురాజ్ అవస్థి నేతృత్వంలో ఈ సమావేశం జరగనుంది. ఇందలో ఒకేసారి లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేయనున్నారు.…

AP : రేపు ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు…

ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ‘మిలాద్-ఉన్-నబీ’ సందర్భంగా ఈ నెల 28న అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు మంజూరు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి మంగళవారం జారీ…

TS : రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవు…

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 28వ తేదీన స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. హైదరాబాద్లోతో పాటు GHMC పరిధిలోకి వచ్చే రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవు అమల్లో ఉంటుందని స్పష్టం…

హన్మకొండ : ఈనెల 28న భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభం

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 28న భద్రకాళి బండ్ వద్ద బోటింగ్ యూనిట్ ప్రారంభించేందుకు జిల్లా పర్యాటక శాఖ ఏర్పాట్లు చేసింది. వరంగల్ భద్రకాళి, హనుమకొండలోని వడ్డేపల్లి చెరువు, ధర్మసాగర్ రిజర్వాయర్లో బోటు షికారును నిర్వహించాలని పర్యాటక శాఖ నిర్ణయించింది.…

HYD : దుర్గం చెరువులో మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ల ప్రారంభం

సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు. పొడవులో..మ్యూజికికి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల…

HYD : నిఘా కెమెరాల నీడలో గణేశ్ విగ్రహాల నిమజ్జనాలు…

పోలీసులు బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని వార్ రూం ద్వారా కీలక ప్రాంతాల్ని గమనించేలా ఏర్పాట్లు చేశారు. బాలాపూర్ నుంచి హుస్సేనాసాగర్ వరకూ 19 కిలోమీటర్లు సాగే ఊరేగింపు మార్గాల్లోని ప్రధాన ప్రాంతాలన్నీ నిఘా కెమెరాల నీడలో ఉన్నాయి. రాచకొండ కమిషనరేట్లో…

HYD : గణేశ్ నిమజ్జనం కోసం 40 వేల మంది పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు

గణేశ్ ఊరేగింపు, నిమజ్జనం కోసం రాజధానిలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు కమిషనరేట్లలో కలిపి రికార్డు స్థాయిలో 40వేల మంది పోలీసుల్ని బందోబస్తు కోసం ఉపయోగిస్తున్నారు. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 25,694మంది విధుల్లో పాల్గొంటున్నారు. 125ప్లటూన్ల అదనపు…

చాలా కాలంగా కేంద్రం వద్ద పెండింగ్ లో కొలీజియం సిఫార్సులు… సుప్రీంకోర్టు విస్మయం

న్యాయమూర్తుల నియామకాలు, బదిలీలకు సంబంధించి కొలీజియం చేసిన 70 సిఫార్సులు కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్లో ఉండడంపై సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వీటిని పరిష్కరించటానికి ప్రయత్నించాలని అటార్నీ జనరల్ ఆర్.వెంకటరమణికి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్…

TS : రానున్న 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం…

తెలంగాణలో వచ్చే ఐదు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, ఉపరితల ఆవర్తనం కూడా కొనసాగుతుందని పేర్కొంది. వీటి ప్రభావంతో అక్టోబర్ ఒకటి వరకు పలుచోట్ల ఉరుములు,…

Punjab: రైల్ రోకోకు పిలుపునిచ్చిన రైతు సంఘాలు

పంజాబ్ లో రేపటి నుంచి మూడు రోజులపాటు రైల్ రోకోకు రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. రైతు సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కిసాన్ మజ్దాూర్ సంఘర్ష్ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్ సింగ్ ప్రకటించారు.…

ఉప్పు ఎక్కువగా వాడుతున్న భారతీయులు అధ్యయనంలో వెల్లడి…

భారతీయుల్లో ఉప్పు వాడకం ఎక్కువగా తీసుకుంటున్నారని తాజా అధ్యయనంలో గుర్తించారు వైద్యులు. ప్రతిరోజూ ఆహారం ద్వారా సగటు భారతీయుడు 8 గ్రాముల ఉప్పు తీసుకుంటున్నాడని, ఇది వైద్యులు సూచించిన పరిమితి (5 గ్రాములు) కన్నా 3 గ్రాములు ఎక్కువగా ఉందని తాజా…

రొమ్ము క్యాన్సర్ తో కన్నుమూసిన నెల్సన్ మండేలా మనవరాలు

నల్లజాతి సూరీడు, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా మనవరాలు జొలేకా మండేలా (43) కన్నుమూశారు. రచయిత, ఉద్యమకారిణి అయిన జొలేకా రొమ్ము క్యాన్సర్ తో పోరాడుతూ తుది శ్వాస విడిచారు. తనకు క్యాన్సర్ సోకడంతో దానికి సంబంధించిన చికిత్స, తన…

భారత టెన్నిస్ దిగ్గజానికి అరుదైన గుర్తింపు

భారత టెన్నిస్ దిగ్గజ ఆటగాడు లియాండర్ పేస్ అరుదైన ఘనత సాధించాడు. 2024కు గానూ ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కోసం ఆరుగురు క్రీడాకారుల్లో లియాండర్ స్థానం సంపాదించాడు. మిగతా క్రీడాకారుల్లో జింబాబ్వేకు చెందిన కారాబ్లాక్, సెర్బియన్…

AP : తిరుమలలో ఈ రోజుతో ముగియనున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. ఈ రోజు పుష్కరిణిలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామికి, శ్రీవక్రత్తాళ్వార్కు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహిస్తారు. ఈరోజు రాత్రి ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. నిన్న రాత్రి అశ్వవాహనంపై కల్కి అలంకరణలో మలయప్పస్వామి మాడ…

AP : ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు – వాతావరణ శాఖ

ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 3 రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, పల్నాడు, శ్రీ సత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు…

మోదీ వాట్సప్ ఛానల్ కు ఫాలోయర్స్ ఎంతో తెలుసా…

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ తీసుకువచ్చిన ‘ఛానెల్స్’ లో ఇటీవలే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేరారు. కొద్ది రోజుల్లోనే ఆయనను 50 లక్షల మంది అనుసరించడం ప్రారంభించారు. ‘వాట్సప్ ఛానల్ ద్వారా మీరంతా నాతో అనుసంధానం కావడాన్ని గొప్ప గౌరవంగా…

తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమీషన్ సభులుగా నియమితులైన ఆర్.ప్రవీణ్

తెలంగాణ రాష్ట్ర ఎస్సి,ఎస్టీ కమిషన్ సభ్యులుగా నియమితులైన బెల్లంపల్లికి చెందిన రేణికుంట్ల ప్రవీణ్. ఆయనను నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా కు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు అనుచరులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించిన మున్సిపల్ కమిషనర్…

బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ చెరువు వద్ద ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శుక్రవారం వినాయక నిమజ్జనం ఏర్పాట్లను మున్సిపల్ కమిషనర్ కె.సమ్మయ్య పర్యవేక్షించారు. మున్సిపల్ కమిషనర్ తో పాటు వన్ టౌన్ ఎస్.హెచ్.ఓ శంకరయ్య పోలీసు సిబ్బంది మున్సిపల్ మేనేజర్ కె.…

గృహలక్ష్మి పథకంపై కేసీఆర్ కీలక ప్రకటన

గృహలక్ష్మి పథకంపై సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. సొంతంగా స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదల కోసం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించామని తెలిపారు. లబ్ధిదారులకు గృహ నిర్మాణం కోసం మూడు దశల్లో రూ .3 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం…

పార్టీ నాయకులకు కీలక సూచనలు చేసిన సోనియా

కాంగ్రెస్ నేతలకు సోనియా గాంధీ కీలక సూచనలు చేశారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు చాలా సంయమనం పాటించాలన్నారు. మీడియా ముందు పొరపాటుగా చేసిన చిన్న వ్యాఖ్య అయినా అది కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బ తీస్తుందన్నారు. వ్యక్తిగత అభిప్రాయాలను పెట్టి పార్టీ గెలుపు…

ఫ్లిప్కార్ట్ కస్టమర్లకు గుడ్ న్యూస్… కొత్త ఫీచర్ అందుబాటులోకి…

ఫ్లిప్కార్ట్ షాపింగ్ చేసేవారికి శుభవార్త. కొత్త ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. ‘ప్రైస్ లాక్’ పేరుతో వస్తోన్న ఈ ఫీచర్ ద్వారా ఎన్నో బెనిఫిట్స్ పొందొచ్చు. దీనిద్వారా కస్టమర్లు వారికినచ్చిన ప్రొడక్ట్ను చిన్న మొత్తంతో ముందుగానే బుక్ చేసుకోవచ్చు. ఇలా బుక్ చేసుకున్న…

చంద్రబాబును కలవడంపై క్లారిటీ ఇచ్చిన రజినీకాంత్

రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ చీఫ్ ‘ చంద్రబాబును కలవడం లేదని సూపర్ రజినీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఫ్యామిలీ ఫంక్షన్ కారణంగా కుదరలేదని చెప్పారు. అయితే ఆయనతో తనకు దశాబ్దాలుగా ప్రత్యేక అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. చెన్నై నుంచి…

విశ్వకర్మ పథకం ప్రారంభించిన ప్రధాని

విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం ప్రధాని మోదీ కొత్త పథకం ప్రారంభించారు. రూ .13 వేల కోట్లతో పీఎం విశ్వకర్మ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని ద్వారకలో ఏర్పాటు చేసిన ఎక్స్పోలో పలు చేతి…

భారత్ శత్రువులకు కేంద్రమంత్రి హెచ్చరిక

జమ్మూకశ్మీర్ అనంతనాగ్, బారాముల్లా జిల్లాల్లో ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న క్రమంలో… కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ శత్రువులకు హెచ్చరిక జారీ చేశారు. శత్రువులు భారత్ ఎదుగుదలను ఆపాలనుకుంటున్నారు. ఇది నూతన భారతం… మీ ఆటలు చెల్లవు. మేం యుద్ధాన్ని కోరుకోం…

ప్ర‌ధాని మోదీకి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు… చాయ్వాలా టు ప్రధాని

దేశ ప్రధాని కావడం నాయకులు జీవితకాలం అచీవ్మెంట్గా భావిస్తారు. గుజరాత్లో 1950 సెప్టెంబర్ 17 న జన్మించిన మోదీ చాయ్ వాలాగా ఉన్న తండ్రికి బాల్యంలో సాయంగా ఉన్నారు. BJP నాయకుడి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా మోదీ…

ఇండియా కూటమి జర్నలిస్టులు బాయ్కిట్ నేపథ్యంలో బిహార్ సీఎం కీలక వ్యాఖ్యలు

ఇండియా కూటమి 14 మంది జర్నలిస్టులు, న్యూస్ యాంకర్లను బాయ్కిట్ చేసిన నేపథ్యంలో బిహార్ సీఎం నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ఈ అంశంపై ఎలాంటి సమాచారం లేదని .. తన మద్దతు జర్నలిస్టులకు ఇస్తానని చెప్పారు. బాయ్కాట్…

ఇవాళ మరో మైలురాయి అందుకోనున్న భారత క్రికెటర్ రోహిత్ శర్మ

భారత స్టార్ ప్లేయర్, కెప్టెన్ రోహిత్ శర్మ మరో మైలురాయిని అందుకోనున్నారు. ఇవాళ శ్రీలంకతో జరగనున్న మ్యాచ్లో 250 వన్డేలు ఆడిన ఆటగాడిగా నిలవనున్నారు. ఇప్పటివరకు 249 మ్యాచులు ఆడిన హిట్ మ్యాన్ 10,031 పరుగులు చేయగా… బ్యాటింగ్ సగటు 48.69…

ఈ రోజు హైదరాబాద్ లో అమిత్ షెడ్యూల్ ఇదే…

తెలంగాణ విమోచన దినోత్సవంలో పాల్గొనేందుకు కేంద్రమంత్రి అమిత్ నిన్న రాత్రి హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ ఉదయం ఆయన 8.35 గంటలకు పరేడ్ గ్రౌండ్ చేరుకోనుండగా… 9 గంటల నుంచి 11 వరకు జరిగే కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత…

J & K : గత 4 రోజులుగా కొనసాగుతున్న ఎన్ కౌంటర్లో ఉగ్రవాదుల ఏరివేత…

జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అనంత్నాగ్ జిల్లాలో గత 4 రోజులుగా జరుగుతున్న ఎన్ కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు టెర్రరిస్టులు ఉన్నట్లు డ్రోన్ కెమెరాలో రికార్డు అయింది. మరోవైపు బారాముల్లా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు…

ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మృతిపై ప్రధాని మోదీ సంతాపం

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అక్క, ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మృతిపై ప్రధాని మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా ప్రసిద్ధ రచయిత్రి గీతా మెహతా మరణించినందుకు నేను బాధపడుతున్నాను. ఆమె బహుముఖ ప్రజ్ఞాశాలి, ఆమె రచనతో పాటు…

AI తోనే భవిష్యత్తు… – LinkedIn సర్వే

AI ఆధారిత నూతన సాంకేతిక పరిజ్ఞానం అన్ని విభాగాల్లో శరవేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో ఐటీ ఉద్యోగులు, కొత్త తరం నిపుణులు దీనిపై అత్యంత ఆసక్తిగా ఉన్నట్లు, ఉద్యోగ భవిష్యత్తుకు AI లో నైపుణ్యం సాధించడం ఎంతో అవసరమని భావిస్తున్నట్లు LinkedIn…

Mexico : జాలిస్కోలోని ఒక బార్లో కాల్పుల కలకలం… ఆరుగురి మృతి

మెక్సికోలో కాల్పులు కలకలం రేపాయి. పశ్చిమ మెక్సికన్ రాష్ట్రమైన జాలిస్కోలోని ఒక బార్లో జరిగిన కాల్పుల్లో ఆరుగురు మృతి చెందినట్లు అక్కడి అధికారులు తెలిపారు. మెక్సికో స్వాతంత్య్ర దినోత్సవం సంద్భంగా జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో ఈ కాల్పులు జరిగాయని చెప్పారు. నిందితులను…

కెనడాలోని పలు ప్రాంతాల్లో భీబస్థం సృష్టించిన ‘ లీ ‘ తుఫాను

అమెరికా, కెనడా దేశాలను ‘లీ’ తుఫాను కుదిపేసింది. ఈశాన్య యునైటెడ్ స్టేట్స్, కెనడాలోని పలు ప్రాంతాల్లో లీ తుఫాను బీభత్సానికి దాదాపు 10 వేల మంది ప్రజలకు విద్యుత్ అంతరాయం కలిగి చీకట్లో మగ్గిపోయారని అక్కడి అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావిత…

TS – Hyd : ఉగ్రవాద సానుభూతి పరులపై NIA ఫోకస్ – సోదాలు

హైదరాబాద్ లో మరోసారి NIA సోదాలు కలకలం రేపాయి. దక్షిణాది రాష్ట్రాలలో ఉగ్రవాద సానుభూతి పరులపై NIA ఫోకస్ చేసింది. సౌత్ లో మొత్తం 31 ప్రాంతాల్లో సోదాలు చేసి పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకుంది. తెలంగాణలోని HYD, సైబారాబాద్ ప్రాంతాల్లో…

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీలో నారా బ్రాహ్మణి

చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నారా భువనేశ్వరితో పాటు నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. ఎన్నికల్లో లబ్ధికోసమే ఇలాంటి పనులు చేస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. రాజకీయ దురుద్దేశంతోనే TDP అధినేత చంద్రబాబును జైలుకు పంపారని… చంద్రబాబు,…

ఏ వయసు వారు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి

బిజీబిజీ జీవితాల్లో శృంగారానికి చాలా మంది దూరంగా ఉంటున్నారు . కానీ రోజూ శృంగారంలో పాల్గొంటే ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. 35 ఏళ్లు వచ్చేసరికి బాధ్యతలు మీద పడి ఆ సుఖానికి దూరమైపోతున్నారు. కానీ ఈ వయసులో వారానికి కనీసం…

జమిలి ఎన్నికలు రాజ్యాంగంపై దాడే : చిదంబరం

హైదరాబాద్ లో నిర్వహిస్తోన్న సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగా చిదంబరం శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. “ ఒకే దేశం.. ఒకే ఎన్నికల ‘ ( జమిలి ) కు కనీసం ఐదు రాజ్యాంగ సవరణలు అవసరం అని అన్నారు. దాన్ని ఆమోదించేంత…

AP: విమ్స్‌ లో ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టుల భర్తీకి అధికారిక ఉత్తర్వులు జారీ… వాక్‌ ఇన్‌ ఇంటర్వూ ఎప్పుడంటే…

విశాఖ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ లో ఖాళీ గా ఉన్న 43 పోస్టుల భర్తీకి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 21వ తేదీ నుండి వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనుంది. సూపర్‌ స్పెషలిస్ట్‌ వైద్యులకు…

నిపా వైరస్ వ్యాప్తితో అక్కడ స్కూల్స్ బంద్…

కేరళలోని కోజికోడ్ జిల్లాలో నిపా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వచ్చే ఆదివారం వరకు అన్ని విద్యా సంస్థలను వారం రోజుల పాటు మూసివేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని పాఠశాలలు, ప్రొఫెషనల్ కాలేజీలు, ట్యూషన్ సెంటర్లు, ఇతర విద్యా సంస్థలను…

ఈసారి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెరుగనున్న గణపతి విగ్రహాల ప్రతిష్టాపన… ఎన్నంటే…

తొమ్మిది రోజులు పాటు జరిగే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గత సంవత్సరం 3 లక్షల విగ్రహాలను ప్రతిష్టించగా… ఈ ఏడాది ఆ సంఖ్య పెరిగే అవకాశం…

ఈ ఏడాది పెరుగనున్న నోబెల్ బహుమతి ప్రైజ్ మనీ

1901లో ప్రారంభమైన నోబెల్ బహుమతిని ప్రపంచంలో అత్యున్నత అవార్డుగా భావిస్తారు. దీనిని భౌతిక, రసాయన శాస్త్రాలు, సాహిత్యం, శాంతి, వైద్యరంగంలో ప్రారంభించి, 1969 నుంచి ఆర్థిక రంగంలో కూడా అవార్డును ప్రారంభించారు. నోబెల్ విజేతలకు ఈ ఏడాది ప్రైజ్ మనీ పెంచనున్నట్లు…

AP : సమగ్ర శిక్ష అభియాన్లో ఉద్యోగుల జీతాలు 23 % పెంపు

సమగ్ర శిక్ష అభియాన్లో పనిచేస్తున్న పలు కేటగిరీల ఉద్యోగులకు PRC కి అనుగుణంగా 23 % జీతాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఐఈఆర్టీ, పీటీఐ, డీపీఓ, సిస్టం ఎనలిస్టు, సైట్ ఇంజినీర్స్, డ్రైవర్లకు లబ్ధి చేకూరనుంది. జీతాలు పెంపుపై సానుకూలంగా స్పందించిన…

వెస్ట్ బెంగాల్ ని సల్బోనిలో స్టీల్ ప్లాంట్ ను ప్రారంభించనున్న టీమిండియా మాజీ కెప్టెన్

టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ వెస్ట్ బెంగాల్ మేదినీపూర్లోని సల్బోనిలో స్టీల్ ప్లాంట్ను ఇవాళ ప్రారంభించనున్నారు. స్పెయిన్, దుబాయ్ పర్యటనలో భాగంగా సీఎం మమతా బెనర్జీతో పాటు ప్రతినిధి బృందంలో ఉన్న గంగూలీ… ఐదారు నెలల్లో ఈప్లాంట్ నిర్మాణాన్ని పూర్తి…

UP: చిన్నారిపై అత్యాచారం… హత్య… వివరాల్లోకి వెళ్ళితే…

నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన యూపీలోని ఫరూఖాబాద్‌లో చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలిక ఫరూఖాబాద్‌లోని తన ఇంటి ముందు ఆడుకుంటుండగా, కాసేపటికి కనిపించకుండా పోవడంతో… కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కూడా ఊరంతా గాలించారు. పొలంలో ఓ కుక్కల…

రజనీకాంత్, చంద్రబాబుతో ములాఖత్ ఎప్పుడంటే…?

రాజమండ్రి జైల్లో ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడును తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కలవబోతున్నారని ప్రచారం జరుగుతుంది. సోమవారం నాడు చంద్రబాబుతో జైలులో తలైవా ములాఖత్ కాబోతున్నారని తెలుస్తోంది. ఇప్పటికే చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించిన రజనీకాంత్ ఆయనకు సంఘీభావంగా…

సనాతన ధర్మంపై ఉదయనిధి వ్యాఖ్యలకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిన సీఎం యోగి ఆదిత్యనాథ్

డీఎంకే నేత, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మంటలు రేపుతున్నాయి. దీనికి తోడు మరికొంత మంది డీఎంకే నాయకులు ఉదయనిధికి మద్దతుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుండటంతో ఈ వివాదం ఇప్పడప్పుడే సద్దుమణిగేలా కనిపించడం…

ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణం…దళిత మహిళకు మత్తుమందు ఇచ్చి అత్యాచారం….

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఒక దళిత మహిళపై ఇద్దరు ముస్లిం యువకులు దురాగతానికి ఒడిగట్టారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన రాష్ట్రంలోని బరేలీ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే… ఓ దళిత మహిళకు ఇద్దరు ముస్లిం…

అద్బుతం ఆవిష్కరించిన ఇజ్రాయెల్‌ సైంటిస్టులు…జీవకణంతో మానవ పిండం తయారీ…

ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు అద్భుతం చేశారు. స్త్రీ, పురుషుల కలయికతో సంబంధం లేకుండానే పిండాన్ని సృష్టించారు. ఒక జీవి ప్రాణం పోసుకోవాలంటే అండం, శుక్రకణం తప్పనిసరి. ఏవో కొన్ని ఏకకణ జీవుల్లో మాత్రమే ఇందుకు మినహాయింపు. మనిషి పుట్టుకకు మాత్రం అండం, శుక్రకణం…

USB-C ఛార్జర్‌తో iPhone 15 లాంచ్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

ఆపిల్ తన ఐఫోన్ 15 సిరీస్‌ను ఈ రోజు వండర్లస్ట్ ఈవెంట్‌లో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 15 ప్రో మరియు ఐఫోన్ 15 ప్రో మాక్స్‌లను కలిగి ఉంది. లైనప్ యొక్క ప్రో మోడల్‌లు సరికొత్త టైటానియం…

స్వీట్స్ తిన్న వెంటనే నీళ్లు తాగుతున్నారా?మీ ప్రాణాలు డేంజర్లో పడ్డట్లే..

ప్రతి వేడుకను తీపి చేసుకుందామా.. అని ఎటువంటి కార్యక్రమం అయిన సరే స్వీట్స్ పెడుతున్నారు..మనలో చాలా మంది తీపి పదార్థాలను ఇష్టంగా తింటారు. పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా తీపి పదార్థాలను, స్వీట్ లను ఇష్టంగా తింటూ ఉంటారు. ఏ…

కన్న కూతురి పై ప్రేమతో 667 టాటూలు వేయించుకున్న తండ్రి..

కూతురంటే ఏ తండ్రీకైనా ప్రేమ ఉంటుంది.. వారి అనుబంధం గురించి మాటలు లేవు.. ఇక రావు.. విడదీయని బంధం ఇది.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా కూతురుపై ప్రేమను చూపిస్తారు.. అదే విధంగా యూకేకి చెందిన ఓ వ్యక్తికి తన కూతురంటే ఎంత…

చరిత్రలో ఈరోజు… సెప్టెంబర్ 09…

సంఘటనలు 1908 – ఆంధ్రపత్రిక ప్రారంభించబడింది. తెలుగు లెక్కలో కీలక నామ సంవత్సరం బాధ్రపద శుద్ధ చతుర్థి హిందువులకు పండుగ దినమైన వినాయక చవితి నాడు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు ఆంధ్రపత్రికను వారపత్రికగా ప్రారంభించారు. ఇది బొంబాయిలోని తత్వవివేచక ముద్రాక్షరశాలలో ముద్రించబడేది.…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబరు 09,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…

భారత్ పేరు మార్పు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలి… – చైనా

G20 సదస్సును అంతర్జాతీయంగా ఖ్యాతిని గడించడానికి భారత్ ఒక అవకాశంగా పరిగణిస్తోంది. అయితే, పేరు కంటే ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టాలని చైనా సూచించింది. ఇండియాను భారత్‌గా మార్చబోతోందన్న వార్తలపై దేశంలోని ప్రతిపక్షాలు గుర్రుగా ఉండగా.. చైనా మాత్రం భారత్ పై…

నీట మునిగి హాంకాంగ్…భారీ వర్షాలతో అత్యధిక వర్షపాతం నమోదు…

గురువారం రాత్రి నుండి హాంకాంగ్ ఈశాన్య భాగంలో కురుస్తున్న భారీ వర్షాలతో 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. 140 సంవత్సరాల తర్వాత ఈ భారీ వర్షాలు, వరదలతో హాంకాంగ్‌ వీధులు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్‌లు నీట…

చరిత్రలో ఈరోజు…సెప్టెంబర్ 08…

సంఘటనలు 1970: మూడవ అలీన దేశాల సదస్సు లుసాకా లో ప్రారంభమైనది. జననాలు 1862: వేంకట శ్వేతాచలపతి రంగారావు, బొబ్బిలి జమీందారీకి రాజు (మ1921). 1879: మొక్కపాటి సుబ్బారాయుడు, పరిపాలనా దక్షుడు, పండితుడు. (మ.1918) 1908: చెలికాని అన్నారావు, తిరుమల బాలాజీ…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబరు 08, 2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…

ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పద మృతి… వివరాల్లోకి వెళ్ళితే…

ముంబైలోని తన ఫ్లాట్‌లో ఓ ఎయిర్ హోస్టెస్ అనుమానాస్పదంగా మృతి చెందింది. ఆమె రక్తపు మడగులో విగతజీవిగా పడివుండటం కలకలం రేపింది. ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి చెందిన రూపాల్ ఓగ్రే అనే 25 యేళ్ల యువతి ఎయిర్ ఇండియాలో ఉద్యోగానికి ఎంపిక కావడంతో…

బొప్పాయి గింజలు – ఆరోగ్యం

బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాటితో పాటు బొప్పాయి గింజలు కూడా జీర్ణ సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. బొప్పాయి గింజలను తీసుకుంటే చెడు కొవ్వుని కరిగించగలదు. బరువు కంట్రోల్ లో ఉంటుంది కాబట్టి బొప్పాయి గింజల్ని తీసుకుంటూ ఉండండి. బొప్పాయి…

రజినీకి గవర్నర్ పదవి? ప్రాధాన్యత సంతరించుకున్న రజనీకాంత్ తమ్ముడి వ్యాఖ్యలు

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌కు గవర్నర్‌గా నియమించనున్నారంటూ కోలీవుడ్‌లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఇందుకోసం రజినీకాంత్ సతీమణి లతా రజినీకాంత్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీనిపై రజినీకాంత్ సోదరుడు సత్యనారాయణ స్పందించారు. రజినీకాంత్‌కు గవర్నర్ పదవి అనేది దేవుడి చేతిలో…

చరిత్రలో ఈ రోజు…సెప్టెంబర్ 06…

సంఘటనలు 1968 : స్వాజీలాండ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. 2018 : తెలంగాణ అసెంబ్లీ రద్దు చేయబడింది. జననాలు 1766: జాన్‌ డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి పునాదులు వేసిన బ్రిటీష్ శాస్త్రవేత్త 1892: సర్ ఎడ్వర్డ్ విక్టర్ ఏపిల్టన్, నోబుల్ బహుమతి…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబర్ 06,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…

మంటకలిసి పోయిన మానవత్వం…పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి ఓ తల్లి…

రాను రాను సమాజంలో మానవత్వం మంట కలిసిపోతుంది. తాజాగా ఇలాంటి సమాజం తలదించుకోవాల్సిన ఘటన చిత్తూరులో చోటుచేసుకుంది. పురిటిబిడ్డను మురికి కాలువలో పడేసి వెళ్లిపోయింది ఓ తల్లి. వివరాల ప్రకారం పలమనేరు కేవీఎస్ స్ట్రీట్ లో ఓ పసికందు ఏడుపు వినిపించింది.…

తెలంగాణలో భారీ వర్షాలు… జలసిరులతో కళకళలాడుతున్న ప్రాజెక్టులు

భారీ వర్షాలకు తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులు జలసిరులను సంతరించుకున్నాయి. అన్ని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. బీభత్సమైన వానలకు కొమురం భీం జిల్లాలోని ఆడ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల…

భారత్ లో జీ20 సదస్సుకు పూర్తయిన ఏర్పాట్లు…

జీ20 సదస్సుకు భారత్ భారీ ఏర్పాట్లు చేసింది. అమెరికాతోసహా 20 అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల అధినేతలు ఒకే వేదిక పైకి వస్తున్నాయి. ఆర్థిక అసమానతలు మొదలుకుని వాతావరణ మార్పుల వరకు ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న పలు ప్రధాన సమస్యలపై సెప్టెంబర్‌…

సనాతన ధర్మం పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి కొడుకు

తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కొడుకు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ ‘సనాతన ధర్మం’పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని శనివారం అన్నారు. సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు. ‘సనాతన…

అక్రమ సంబంధం పెట్టుకుందని మహిళపై స్థానికుల విచక్షణా రహిత దాడి… వివరాల్లోకి వెళ్ళితే…

వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ఓ విచిత్ర ఘటన జరిగింది. అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళపై కొందరు స్థానికులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఆ తర్వా ఆమె జట్టు కత్తిరించి, నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు. రాష్ట్రంలోని ఉత్తర దినాజ్‌పూర్ జిల్లాలో ఈ దారుణం…

మోడీ గారు మన దేశం పేరును మార్చనున్నారా…!

ప్రధాని నరేంద్ర మోడీ సంచలనం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా గా ఉన్న మన దేశ పేరును భారత్ గా మార్చేందుకు సిద్ధమయ్యారట. దేశం పేరు భారత్ గామార్చేందుకు అడుగులు వేస్తుందట మోడీ సర్కార్. అందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుందట.…

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. నగరాన్ని ముంచెత్తిన వర్షం నీరు

హైదరాబాద్‌లో పలు చోట్ల కుండపోతగా వర్షం కురుస్తున్నది. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. ఖైరతాబాద్‌, అమీర్‌పేట, సోమాజీగూడ, నాంపల్లి, మలక్‌పేట, సైదాబాద్‌, పాతబస్తీ, ఎల్బీనగర్‌, సాగర్‌రింగ్‌రోడ్‌, హస్తినాపురం, బీఎన్‌రెడ్డి, నాగోల్‌, ఉప్పల్‌, హబ్సిగూడ, తార్నాక, ఈసీఐఎల్‌,…

ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్

ఉపాధ్యాయుల దినోత్సవం మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, జ్ఞానం పెంపొందించి, లక్ష్యం పట్ల వారి కి స్పష్టమైన అవగాహన కలిగించి, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడంలో గురువుల…

Hyderabad: స్కూళ్లకు సెలవు ప్రకటించిన విద్యాశాఖ: నేడు ఉత్తర్వులు

హైదరాబాద్‌లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా విద్యాశాఖ నేడు స్కూళ్లకు సెలవు ప్రకటించింది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులను ప్రకటిస్తూ విద్యాశాఖ నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కుండపోత వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా…

Telangana : వాతావరణ శాఖ హెచ్చరిక…మరో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు…

గత రెండ్రోజులగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో 4 రోజుల పాటు కొనసాగనున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు.…

చరిత్రలో ఈరోజు…సెప్టెంబర్ 05…

సంఘటనలు 1973: నాల్గవ అలీన దేశాల సదస్సు అల్జీర్స్ లో ప్రారంభమైనది. జననాలు 1803: పురుషోత్తమ చౌదరి, తెలుగు క్రైస్తవ పదకవితా పితామహుడు. తొలి తెలుగు క్రైస్తవ వాగ్గేయకారుడు. (మ.1890) 1884: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు. 1888: సర్వేపల్లి…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబరు 5,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరందక్షిణాయనం – వర్ష ఋతువునిజ శ్రావణమాసం – కృష్ణ పక్షం తిథి : షష్ఠి రా8.46 వరకు వారం…

ఈ నెల నుండి ఆర్థిక రంగంలో రాబోతున్న 5 మార్పులు…

సెప్టెంబర్‌ నెల నుంచి ఆర్థిక రంగంలో 5 మార్పులు రాబోతున్నాయి. వాటి ద్వారా ప్రజలపై భారాలు పడనున్నాయి. ఆర్థిక రంగంలో సెప్టెంబర్ నెల అనేక మార్పులు తీసుకువస్తోంది. ఈ మార్పులలో కొన్ని మొదటి రోజు నుండి అమలులోకి రానుండగా.. మరికొన్ని నెల…

Telangana: భారీ వర్షాలు – ఆరెంజ్ అలెర్ట్ జారీ…

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్, మరికొన్ని జిల్లాలలకు ఆరెంజ్ అలెర్ట్‌ను జారీచేసింది వాతావరణ శాఖ… అయితే ఈ వర్షాలు వచ్చే మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈశాన్య బంగాళాఖాతంలో…

జమిలీ ఎన్నికలకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా మీకు…?

దేశంలో వచ్చే యేడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలతో కలిపి 12 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని భావిస్తుంది. అయితే, దేశంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలంటే ఏకంగారూ 9,300 కోట్ల…

విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో పలు రైళ్లు రద్దు… వివరాలు ఇవే…

నేటి నుంచి ఈ నెల 10 వరకు పలు రైళ్లు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్‌ పరిధిలో నిర్వహణ పనుల నిమిత్తం ఈ రైళ్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.…

5 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్… ఎందుకు…? ఎప్పుడు…? వివరాల్లోకి వెళ్ళితే…

ఢిల్లీలో మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఎందుకంటే రాజధాని ఢిల్లీలో ఐదు రోజుల పాటు మద్యం షాపులు బంద్ అవుతాయి. దీని కారణంగా ప్రజలు తాగేందుకు మందు దొరకడం కష్టమవుతోంది. దీంతో గత కొద్ది రోజులుగా రాజధానిలో మద్యం విక్రయాలు జోరందుకున్నాయి.…

అమెరికాలోని ఫెస్టివల్‌ లో చిక్కుకు పోయిన 70 వేల మంది… ఎంటా ఫెస్టివల్‌…? ఏం జరిగింది…? వివరాల్లోకి వెళ్ళితే…

పండుగలో ఆనందంగా గడపాల్సిన వారు అనుకోని పరిస్థితుల కారణంగా అక్కడ చిక్కుకుపోవాల్సింది. ఇలా ఇరుక్కున్నది ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 70 వేల మంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇది జరిగింది నెవడాలోని బ్లాక్‌రాక్ ఎడారిలో. అమెరికాలో…

విచారణలో పోలీసులు సైతం అవాక్కయిన సంఘటన…ఏకంగా వందమంది మహిళలను…

తనను ప్రియురాలు మోసం చేసిందన్న అక్కసుతో ఆ ప్రియుడు ఏకంగా వంద మంది మహిళలను వడోదర‌కు చెందిన రాకేశ్ సింగ్ అనే వ్యక్తి మోసం చేశాడు. అలాంటి వ్యక్తిని వడోదర సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో అతను వెల్లడించిన…

దేశ వ్యాప్తంగా గడిచిన 5 ఏళ్లలో ఎన్ని పులులు చనిపోయాయో మీకు తెలుసా…

గత ఐదేళ్లలో 661 పులులు మృత్యువాత పడినట్లుగా కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ వెల్లడించింది. వృద్ధాప్యం, వ్యాధులు, అంతర్గత పోరాటాలు, విద్యుదాఘాతం, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా ఎక్కువగా పులులు చనిపోయినట్లుగా వెల్లడించింది. అయితే ఇందులో ఎక్కువగా పెద్ద పులులున్నాయని తక్కువగా శిశుమరణాలున్నట్లు…

నెట్టింట వైరల్ న్యూస్…రాహుల్ గాంధీకి వంట నేర్పిన ఆర్జేడీ చీఫ్…

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి మటన్ కూర ఎలా ఉండాలో ఆర్జేడీ చీఫ్, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పైగా తనకు కూడా వంట చేయడం…

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్ దిగ్గజం హీత్‌ స్ట్రీక్‌ (49) కన్నుమూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ ఆదివారం వేకువజామున తుది శ్వాస విడిచినట్లు అతడి కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఫ్లవర్‌ సోదరులతోపాటు జింబాబ్వే క్రికెట్‌ను ఉన్నతస్థాయికి చేర్చడంలో హీత్ స్ట్రీక్‌ కీలక పాత్ర పోషించాడు. ఆల్‌రౌండర్‌గా…

అక్క తమ్ముడి పై ప్రేమోన్మాది కత్తితో దాడి… వివరాల్లోకి వెళ్ళితే…

ఎల్బీ నగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆర్టీసీ కాలనీలో అక్క, తమ్ముడిపై శివకుమార్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ తమ్ముడు చింటూ చికిత్స పొందుతూ చనిపోయాడు. అక్క సంఘవి పరిస్థితి విషమంగా ఉంది. కామినేని ఆసుపత్రిలో…

TS : ప్రేమ మత్తులో సొంత అక్కను చంపిన చెల్లి… ఎక్కడ…? వివరాల్లోకి వెళ్ళితే…

జగిత్యాల జిల్లా, కోరుట్లలో జరిగిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దీప్తి హత్య కేసులోని మిస్టరీని పోలీసులు ఛేదించారు. సొంత అక్కను చెల్లి చందన చంపేసింది. ఇంట్లో ఉన్న డబ్బు, నగలను తీసుకుని తన ప్రియుడితో వెళ్లిపోయేందుకు ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పింది. ఈ…

తిరుమల : తిరుపతి లో శ్రీవారి దర్శనం కోసం కొనసాగుతున్న భక్తుల రద్దీ…

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కొనసాగుతోంది. నేడు శ్రీవారి దర్శనం కోసం 26 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి నేడు 12 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.05 కోట్లు వచ్చినట్టు తిరుమల…

వరంగల్ జిల్లా : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొన్న వ్యక్తి సంఘటన స్థలంలోనే చనిపోయాడు. ఈ ఘటన సోమవారం ఉదయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఉప్పరపల్లి క్రాస్ రోడ్డు వరంగల్ ఖమ్మం జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు…

జాలర్ల జీవితం మార్చిన చేప…అదేం చేప… దాని ఖరీదెంతో తెలుసా…

పశ్చిమ బెంగాల్ కు చెందిన కొందరు జాలర్లకు. ఖరీదైన చేపలు దొరికి జాలర్ల జీవితం రాత్రికి రాత్రే మారిపోయింది. వివరాల్లోకి వెళ్ళితే…. సాధారణంగా ప్రతి ఏడాది హిల్సా(పులసచేపలు) చేపల ఉత్పత్తిపైనే వారి ఆదాయం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. దిఘా ఈస్ట్యూరీ ఫిష్…

బంగారం – వెండి ధరలు…

బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 4) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,200 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,220గా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల బంగారం ధరపై.. 24…

చరిత్రలో ఈరోజు…సెప్టెంబర్ 04…

సంఘటనలు 1781: 44మంది నివసించటంతో లాస్ ఏంజెల్స్ నగరం, “బహియా డి లాస్ ఫ్యూమ్” (పొగల లోయ – వేలీ ఆఫ్ స్మోక్స్) లో స్థాపించబడింది. 1833: మొట్టమొదటి న్యూస్ బాయ్ (దినపత్రికలు ఇంటికి పంచేవాడు) (బార్నీ ఫ్లాహెర్టీ – న్యూయార్క్…

నేటి పంచాంగం – రాశి ఫలాలు సెప్టెంబర్ 04,2023

ఓం శ్రీ విఘ్నేశ్వరాయః నమఃఓం శ్రీ మాత్రే నమఃఓం నమో నారాయణాయఓం శ్రీ గురుభ్యోనమః నేటి పంచాంగం విక్రమ సంవత్సరం: 2080 నల శక సంవత్సరం: 1945 శోభకృత్ ఆయనం: దక్షిణాయణం ఋతువు: వర్ష మాసం: నిజశ్రావణ పక్షం: కృష్ణ –…

భర్తను చంపిన భార్య… ఎక్కడ… ఎందుకు… అసలు వివరాల్లోకి వెళ్ళితే…

తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య తన భర్తను అత్యంత దారుణంగా కడతేర్చింది. తాళ్లతో బంధించి చిత్రహింసలకు గురి చేసి హత్య చేసింది. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా తూఫ్రాన్…

TS : రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు… ప్రజలు అప్రమత్తంగా ఉండాలి… మంత్రి తలసాని

ఇవాల్టి నుంచి తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమవారం, మంగళవారం ఇలా మూడు రోజులపాటు భారీ…

వాటిపై ఆధార్ సంఖ్య ముద్రించొద్దు… యూనివర్సిటీలకు యూజీసీ ఆదేశాలు…

కొన్ని విద్యా సంస్థల్లో ప్రవేశాలు, రిక్రూట్ మెంట్ విషయంలో రాష్ట్రాల పరిధిలో సర్టిఫికేట్లలో ఆధార్ సంఖ్య అనేది తప్పనిసరిగా మారిన నేపద్యంలో… విద్యార్థులకు సంబంధించిన సర్టిఫికేట్ల పై విద్యార్థుల ఆధార్ నంబర్ ను ముద్రించవద్దని యూజీసీ యూనివర్సిటీలను ఆదేశించింది. ఇది సరికాదని…

కర్ణాటకలో సంచలనం రేపుతున్న ఆ నాయకుడి రాసలీలల ఫోటోలు…

కర్ణాటక రాష్ట్రంలో జేడీఎస్ పార్టీ నేత, విద్యార్థి విభాగం అధ్యక్షుడి రాసలీలల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రాయచూరులోని దేవదుర్గ తాలూకా యువ జేడీఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలీం కాకరగల్ నలుగురు యువతులతో రాసలీలల్లో మునిగిపోయినట్లు తెలుస్తోంది. పార్టీ…

ఉత్తమ సేవలందించిన 54, మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అందజేసే రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం ఈ ఏడాది 54 మంది టీచర్లను ఎంపిక చేశారు. 2023- 24 విద్యాసంవత్సరానికి గాను 54మంది టీచర్లను ఎంపికచేస్తూ పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శనివారం…

Hyderabad: ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆటోపై కూలిన భారీ వృక్షం … డ్రైవర్ మృతి

ఆటోపై చెట్టు కూలిపోవడంతో ఆటో డ్రైవర్ మృతిచెందిన విషాద ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. హైదర్‌గూడ ఓల్డ్‌ ఎమ్మెల్యే కాలనీలో భారీ వృక్షం కుప్ప కూలింది. సిగ్నల్‌ వద్ద నిలిచిన రెండు ఆటోలపై ఒక్కసారిగా పడింది. దీంతో ఓ ఆటో డ్రైవర్‌…